ఈఎస్ఐ స్కామ్: మరింతగా బయటపడుతున్న దేవికారాణి, నాగలక్ష్మి అక్రమాస్తులు

  • బిల్డర్ కు రూ.4 కోట్లకు పైగా ఇచ్చిన దేవికారాణి, నాగలక్ష్మి
  • ఓ రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొనుగోలుకు యత్నం
  • ఏసీబీ అధికారులకు ఆ డబ్బు తిరిగిచ్చేసిన బిల్డర్
తెలంగాణ ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, ఫార్మసిస్ట్ నాగలక్ష్మిల అక్రమాస్తులు బయటపడ్డాయి. ఓ రెసిడెన్షియల్ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించినట్టు గుర్తించారు.

ఓ బిల్డర్ కు రూ. 4 కోట్లకు పైగా ఇచ్చారన్న సమాచారంతో దాడులు చేసిన అధికారులు, ఆ బిల్డర్ వద్ద రూ.4.47 కోట్లను సీజ్ చేశారు. ఆ బిల్డర్ ఆస్తులను అటాచ్ చేస్తామని హెచ్చరించడంతో అతడు ఆ డబ్బును అధికారులకు తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తంలో రూ.3.37 కోట్లు దేవికారాణి డబ్బు కాగా, మిగతా డబ్బు నాగలక్ష్మికి చెందినదని సమాచారం. అవినీతి సొమ్ముతో వీరిద్దరూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని భావించారని ఏసీబీ అధికారులు అంటున్నారు.

Devikarani
Nagalakshmi
ACB
ESI Scam
Telangana

More Telugu News